Friday, May 24, 2024

భారత్ జోడో యాత్రలో విషాదం.. సేవాదళ్ ప్రధాన కార్యదర్శి కృష్ణ కుమార్ పాండే మృతి

మహారాష్ట్రలోకి అడుగుపెట్టింది కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర. ఈ సందర్భంగా ఈ యాత్రలో విషాదం చోటుచేసుకుంది. రాహుల్ గాంధీకి ముందు జాతీయ జెండాను పట్టుకుని కాంగ్రెస్ పార్టీ సేవా దళ్ కార్యకర్తల బృందం నడుస్తున్న సంగతి తెలిసిందే. ఈ బృందానికి నేతృత్వం వహిస్తున్న సేవాదళ్ ప్రధాన కార్యదర్శి కృష్ణ కుమార్ పాండే యాత్రలో మరణించారు. రోజు మాదిరే మంగళవారం కూడా కృష్ణ కుమార్ పాండే రాహుల్ కు ముందు నడుస్తున్న సేవా దళ్ బృందానికి నేతృత్వం వహిస్తూ జాతీయ జెండాను పట్టుకుని నడిచారని, రోజు మాదిరిగానే జాతీయ జెండాను తన సహచరుడి చేతిలో పెట్టిన కాసేపటికే కృష్ణ కుమార్ పాండే కింద పడిపోయారు. ఆ వెంటనే ఆయన మృతి చెందారు. ఈ ఘటనతో రాహుల్ తో పాటు పార్టీ శ్రేణులు దిగ్భ్రాంతికి గురయ్యాయి. కృష్ణ కుమార్ పాండేకు రాహుల్ సహా పార్టీ శ్రేణులు కన్నీటి నివాళి అర్పించాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement