Friday, May 3, 2024

ఏపీ సీఎం జ‌గ‌న్ పాల‌న‌కి – వెయ్యి రోజులు – సంబ‌రాల జాడే లేదు

ఏపీ సీఎంగా జ‌గ‌న్ రాష్ట్రంలో సంక్షేమ పాల‌నకి నేటితో వెయ్యి రోజులు పూర్త‌యింది. దాంతో వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి రాష్ట్రంలో సాగించిన సంక్షేమ పాల‌న‌ను గుర్తు చేసుకుంటూ ఆ పార్టీ నేత‌లు పెద్ద ఎత్తున సంబ‌రాలు చేసుకుంటున్నారు. బ‌య‌ట ఎక్క‌డా ఈ జోష్ క‌నిపించ‌డం లేదు గానీ..సోష‌ల్ మీడియా వేదిక‌గా ఆ పార్టీ అభిమానులు, నేత‌లు త‌మ‌దైన శైలి ఫొటోల‌ను షేర్ చేస్తూ సంబ‌రాలు చేసుకుంటున్నారు. ఏపీలో త‌న పాల‌న మొద‌లై 1,000 రోజులు పూర్తి అయిన సంద‌ర్భంగా జ‌గ‌న్ ఎలాంటి ప్ర‌త్యేక వేడుక‌లేమీ చేసుకోలేదు. అలాగ‌ని పార్టీ శ్రేణుల‌కు ఎలాంటి పిలుపు కూడా ఇవ్వ‌లేదు. రోజు మాదిరిగానే.. రాష్ట్ర ప‌ర్య‌ట‌న‌కు వ‌చ్చిన కేంద్ర జ‌ల‌శ‌క్తి మంత్రి గ‌జేంద్ర సింగ్ షెకావ‌త్‌తో క‌లిసి జ‌గ‌న్ పోల‌వ‌రం ప‌ర్య‌ట‌న‌కు వెళ్లారు. పోల‌వ‌రం ప్రాజెక్టు ప‌నుల‌ను ప‌రిశీలించిన జ‌గ‌న్‌… పున‌రావాస కాల‌నీల‌కు చెందిన ప్ర‌జ‌ల‌తో మాట్లాడారు. వారు ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌ల‌పై ఆరా తీశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement