రాజధాని అమరావతిపై ఏపీ హైకోర్టు కీలక తీర్పు ఇచ్చిన నేపథ్యంలో మందడంలో రైతుల దీక్షా శిబిరం వద్ద పండుగ వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా సినీ నటుడు శివాజీ ఏపీ అధికార పార్టీ వైసీపీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. అధికార పార్టీకి చెందిన 49 మంది ఎమ్మెల్యేలు, 9 మంది ఎంపీలు వేరే పార్టీతో టచ్లో ఉన్నారన్నారు. అమరావతి రైతుల వేడుకల్లో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ కాలంలో కూడా కులం గురించి ఎందుకు మాట్లాడుతున్నారని వైసీపీ నేతలను ప్రశ్నించారు. ప్రజలు కట్టే పన్నును వాడికి వీడికి పంచే హక్కు ముఖ్యమంత్రికి ఎక్కడ ఉందని ప్రశ్నించారు. ప్రత్యేక హోదా గురించి సీఎం మాట్లాడిన మాటలు చాలా దారుణంగా ఉన్నాయన్నారు. తాడికొండ ఎమ్మెల్యే దగ్గరకు వెళ్లి అమరావతి ఏమైందో అడగాలని మహిళలకు సూచించారు. రాష్ట్రంలో యువతకు చేపల కొట్లు, జొమాటో డెలివరీ బాయ్ ఉద్యోగాలే గతి అన్నారు. జగన్ సినిమా మొత్తం అయిపోయిందని.. ఇక మూడు రాజధానులు పేరుతో ఎన్నికలకు వెళ్తాడని చెప్పారు. రాబోయే ఎన్నికల్లో ఆయన బాబాయి వివేకానందరెడ్డి ఉంటే విజయం కొంచెం సులువయ్యేదని వ్యాఖ్యానించారు. ఓటుకు 50 వేలు ఇచ్చినా ఈ సారి వైకాపా గెలిచే పరిస్థితి లేదన్నారు. ముఖ్యమంత్రి తన స్థానాన్ని గెలుచుకోవడానికి గట్టిగా ప్రయత్నించాల్సి ఉంటుంన్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital