Friday, May 17, 2024

Breaking: నార్త్‌జోన్‌లో భారీగా ఇన్స్‌పెక్టర్ల బదిలీ.. ఉత్త‌ర్వులు జారీ చేసిన ఐజీ..

పెద్దపల్లి, (ప్రభన్యూస్‌): నార్త్‌ జోన్‌ పరిధిలో పని చేస్తున్న 45 మంది ఇన్స్‌పెక్టర్లను బదిలీ చేస్తూ ఐజీపీ నాగిరెడ్డి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. మహబూబాబాద్‌ డీ సీఆర్‌బీలో పని చేస్తున్న బి. జనార్దన్‌ను హుజురాబాద్‌ రూరల్‌కు, హుజురాబాద్‌ రూరల్‌ సీఐగా పని చేస్తున్న కిరణ్‌ను జగిత్యాల సీసీఎస్‌కు, మహబూబాబాద్‌ సీసీఎస్‌లో పని చేస్తున్న పి. సురేందర్‌ను ఆదిలాబాద్‌కు, ఆదిలాబాద్‌లో పని చేస్తున్న రామకృష్ణను జైనూర్‌కు, గోదావరిఖని రెండో ఠాణాలో పని చేస్తున్న గోపతి రవీందర్‌ను చొప్పదండికి, చొప్పదండి పని చెస్తున్న నాగేశ్వర్‌రావును కరీంనగర్‌ డీఐజీ అటాచ్డ్‌గా, కరీంనగర్‌ పీటీసీలో పని చేస్తున్న అఫ్జలుద్దీన్‌ను గోదావరిఖని రెండో ఠాణాకు బదిలీ చేశారు.

తాండూరులో పని చేస్తున్న కె. బాబురావును బెల్లంపల్లి రూరల్‌కు, బెల్లంపల్లి రూరల్‌లో ఇన్స్‌పెక్టర్‌గా పని చేస్తున్న కె. జగదీశ్‌ను తాండూరుకు, నిర్మల్‌ డీసీఆర్‌బీలో పని చేస్తున్న శ్రీధర్‌ను ఆదిలాబాద్‌-2కు, వరంగల్‌లో పని చేస్తున్న చంద్రశేఖర్‌ను నిర్మల్‌ డీసీఆర్‌బీకి, ఆదిలాబాద్‌లో పని చేస్తున్న శ్రీనివాస్‌ను ఆసిఫాబాద్‌ డీసీఆర్‌బీకి, వెయిటింగ్‌లో ఉన్న రఘుపతిని ఆదిలాబాద్‌ రూరల్‌ సర్కిల్‌కు, ఆదిలాబాద్‌ రూరల్‌లో పని చేస్తున్న పురుషోత్తంను ఆసిఫాబాద్‌ ఎస్‌బీకి, వెయిటింగ్‌లో ఉన్న నరేశ్‌కుమార్‌ను జైనత్‌కు, జైనత్‌లో పని చేస్తున్న మల్లేశ్‌ను ఆదిలాబాద్‌ ట్రాఫిక్‌కు, డీఐజీ అటాచ్డ్‌గా ఉన్న శ్రీనివాస్‌ను రామగుండం సైబర్‌ క్రైమ్‌కు, సత్యనారాయణను రామగుండం సైబర్‌ క్రైమ్‌కు, ఆసిఫాబాద్‌ ఎస్‌బీలో పని చేస్తున్న రవీందర్‌ను కాగజ్‌నగర్‌కు, కాగజ్‌నగర్‌లో పని చేస్తున్న మోహన్‌ను మంచిర్యాల సీసీఎస్‌కు, ఇల్లందులో పని చేస్తున్న రమేశ్‌ను ఆసి ఫాబాద్‌ ఎస్‌బీకి పని చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement