బంగారం ధర నేడు కూడా కాస్త పెరిగింది. హైదరాబాద్, విజయవాడ,విశాఖపట్నంలో సోమవారం బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర కేవలం రూ.10 పైకి కదిలింది. దీంతో పసిడి రేటు రూ. 51,060కు చేరింది. అలాగే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా ఇదే దారిలో నడిచింది. దీంతో పసిడి రేటు రూ.10 పెరుగుదలతో రూ. 46,810కు చేరింది. బంగారం ధరలు పైకి చేరితే వెండి మాత్రం నిలకడగానే కొనసాగింది. ధరలో ఎలాంటి మార్పు లేదు. దీంతో కేజీ వెండి ధర రూ.67,400 స్థిరంగా ఉంది. నిన్న బంగారం ధర రూ.1000కి పెరిగింది. సిల్వర్ రూ.500 పైకి కదిలింది. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర తగ్గింది. ఔన్స్కు 0.05 శాతం క్షీణించింది. దీంతో పసిడి రేటు ఔన్స్కు 1860 డాలర్లకు తగ్గింది. వెండి మాత్రం పైపైకి చేరింది. వెండి ధర ఔన్స్కు 0.28 శాతం పెరుగుదలతో 23.65 డాలర్లకు ఎగసింది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..