Saturday, May 4, 2024

శబరిమల, గురువాయూర్ ఆలయాలను సందర్శించిన చిరంజీవి

మెగాస్టార్ చిరంజీవి కేరళలోని ప‌లు పుణ్యక్షేత్రాలను సందర్శించారు. సతీసమేతంగా కేరళ వెళ్లిన చిరంజీవికి అక్కడ‌ సాదర స్వాగతం ల‌భించింది. తొలుత శబరిమల వెళ్లిన చిరంజీవి దంపతులు అయ్యప్పస్వామిని దర్శించుకున్నారు. కొండ కింది భాగం నుంచి డోలీ ద్వారా అయ్యప్ప సన్నిధికి చేరుకున్నారు. ఈ సందర్భంగా డోలీ మోసిన కూలీలకు చిరంజీవి కృతజ్ఞతలు తెలిపారు. చాలాకాలం తర్వాత ఇక్కడికి వచ్చానని, భక్తులు, అభిమానుల తాకిడి ఉంటుందని డోలీలో రావాల్సి వచ్చిందని చిరంజీవి తెలిపారు.

అనంతరం చిరంజీవి, ఆయ‌న భార్య సురేఖ గురువాయూర్ చేరుకుని అక్కడి అతిథి గృహంలో విశ్రాంతి తీసుకున్నారు. ఆపై గురువాయూర్ శ్రీకృష్ణ ఆలయాన్ని సందర్శించారు. అక్కడి శ్రీకోవిల్ వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ వర్గాలు చిరంజీవికి ప్రత్యేక జ్ఞాపికను బహూకరించాయి. ఈ కేరళ పర్యటనకు సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో సందడి చేస్తున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement