Friday, May 3, 2024

ప్ర‌కాశం జిల్లాలో గుర్తు తెలియని మృత దేహం.. ద‌ర్యాప్తు చేస్తున్న పోలీసులు

ప్రకాశం : ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోని ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలంలోని హనుమాపురం వాగు వద్ద గుర్తు తెలియని మృతదేహాన్ని సోమవారం ఉదయం పోలీసులు గుర్తించారు. హనుమాపురం గ్రామం సమీపంలోని రహదారి (కాలవ గట్టు) పక్కన గుర్తు తెలియని మృతదేహం ఉన్న విషయాన్ని స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు.

అయితే ఈ మృతదేహం ఎవరిది అనే విషయం ఇంకా తెలియ రాలేదు. ఆత్మహత్య చేసుకున్నాడా. లేక ఎవరైనా హత్య చేసి, కాలువ వద్ద పడవేశారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement