Tuesday, May 14, 2024

Breaking: ర‌క్తం రుచి మ‌రిగిన పులి హ‌తం.. బిహార్‌లో ఆప‌రేష‌న్ టైగ‌ర్ హంట్‌ స‌క్సెస్‌

మ‌నుషుల ర‌క్తం రుచి మ‌రిగిన పులి ప‌ని ఖ‌తం అయ్యింది. బిహార్‌లో మ్యాన్ ఈటర్‌గా మారిన పెద్దపులి ఇప్పటికే తొమ్మిది మంది ప్రాణాలు బలిగొంది. దీంతో అక్కడి అటవీశాఖ, నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ అధికారులు ఆ పులిని చంపేయాలని నిర్జ్ఞించి స్పెష‌ల్ యాక్ష‌న్ చేప‌ట్టారు. శనివారం కూడా ఆ మ్యాన్ ఈటర్ దాడిలో ఓ తల్లి, ఆమె పదేళ్ల కొడుకు మ‌ర‌ణించారు. తల్లీ కొడుకుల మృతితో కోపోద్రిక్తులైన ప్రజలు ఆ ప్రాంతంలో మోహరించిన పోలీసులపై దాడి చేశారు. వారిని పట్టుకుని దారుణంగా కొట్టారు.

ఇక.. బిహార్లోని పశ్చిమ చంపారన్ జిల్లాలోని బగాహాలో తొమ్మిది మందిని చంపిన ఈ మ్యాన్ ఈటర్‌ని చంపేందుకు నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ (ఎన్‌టిసిఎ) అనుమతి ఇచ్చింది. ఇదిలా ఉండగా పులి మ‌ట్టుబెట్టేందుకు చేప‌ట్టిన ఆప‌రేష‌న్ స‌క్సెస్ అయ్యింది. దాన్ని ఎట్ట‌కేల‌కు చంపేసిన‌ట్టు అధికారులు ప్ర‌ట‌కించారు. దీంతో ఆ ప్రాంత ప్ర‌జ‌లు సంతోషం వ్య‌క్తం చేస్తున్నారు. చ‌నిపోయిన పెద్ద‌పులి మృత‌దేహాన్ని చూడ్డానికి పెద్ద ఎత్తున జ‌నాలు ఎగ‌బ‌డ్డారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement