తన కిందిస్థాయి ఉద్యోగుల పనితీరు నచ్చలేదు ఎస్పీ గౌరవ్ మంగళకి. దాంతో తీవ్ర అసహనం వ్యక్తం చేసిన ఆయన ముగ్గురు ఏఎస్ఐ, ఇద్దరు ఎస్ఐలను లాకప్లో వేశారు. రెండు గంటలపాటు వారిని లోపలే ఉంచారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. నాలుగు రోజుల క్రితం జరిగిన ఈసంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈఘటనపై ఎస్పీని ప్రశ్నించగా.. అదేంలేదని.. అదంతా ఫేక్ అంటూ కొట్టిపారేశారు. పోలీసు ఉన్నతాధికారులు కూడా ఎన్నిసార్లు అడిగినా దీనిపై స్పందించేందుకు ఎస్పీ నిరాకరించారు. మరోవైపు బిహార్ పోలీసు సమాఖ్య ఈ ఘటనపై న్యాయ విచారణకు డిమాండ్ చేసింది. సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోపై ఎస్పీని అడిగేందుకు ప్రయత్నిస్తే ఆయన స్పందించట్లేదని పోలీసు సమాఖ్య అధ్యక్షుడు మృత్యుంజయ్ కుమార్ తెలిపారు. ఇలాంటి చర్యలు బిహార్ పోలీసులను అప్రతిష్టపాలు చేస్తాయన్నారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఎస్పీ తన అధికారంతో కిందిస్థాయి అధికారులపై ఒత్తిడి తెచ్చి.. ఈ విషయాన్ని కప్పిపుచ్చేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. విషయం బయటకు చెప్తే మరిన్ని ఇబ్బందులు పడాల్సి వస్తుందని కిందిస్థాయి అధికారులను ఎస్పీ బెదిరిస్తున్నారనే ఆరోపనలు వస్తున్నాయి. ఈఘటనపై ప్రభుత్వం మాత్రం ఇంకా స్పందించలేదు.ఈ సంఘటన బిహార్ నవాడా జిల్లా లో చోటు చేసుకుంది.
ముగ్గురు ఏఎస్ ఐలు..ఇద్దరు ఎస్ ఐలను లాకప్ లో వేసిన ఎస్పీ-వైరల్ గా వీడియో
Advertisement
తాజా వార్తలు
Advertisement