Sunday, April 28, 2024

ముంబై ఎస్‌బీఐ బ్యాంక్ ను పేల్చివేస్తామంటూ బెదిరింపు కాల్..

ఓ గుర్తు తెలియని వ్యక్తి మహారాష్ట్ర రాజధాని ముంబైలోని నారిమన్‌ పాయింట్‌లో ఉన్న ఎస్‌బీఐ కార్యాలయాన్ని పేల్చేస్తామని బెదిరించాడు. బ్యాంక్ మేనేజర్‌ను చంపేస్తామని బెదిరింపు ఫోన్ కాల్ చేసినట్లు పోలీసులు తెలిపారు. బ్యాంకు అధికారుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. తాను పాకిస్తాన్‌ నుంచి మాట్లాడుతున్నానని, తన పేరు ఎండీ జియా ఆల్ అలిమ్‌ అని బ్యాంకు అధికారులను ఫోన్ లో పరిచయం చేసుకున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. తనకు లోన్ ఇవ్వాలని, లేని పక్షంలో బ్యాంక్ చైర్మన్‌ను కిడ్నాప్ చేసి హతమారుస్తానని బెదిరించినట్లు పోలీసులు పేర్కొన్నారు. అవసరమైతే బ్యాంకును కూడా పేల్చేస్తానని ఆ వ్యక్తి బెదిరింపులకు గురి చేసినట్లు తెలిపారు. అయితే పోలీసులు అతని కోసం గాలిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement