Friday, March 29, 2024

వికృత రాజకీయాలు చేస్తున్న జగన్.. అయ్యన్న పాత్రుడు

సీఎం జగన్ వికృత రాజకీయాలు చేస్తున్నాడని ఏపీ మాజీ మంత్రి, టీడీపీ నేత అయ్యన్న పాత్రుడు అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ… అప్పుడు అమరావతి రాజధానికి ఒప్పుకుని ఇప్పుడు విశాఖ రాజధాని అంటున్నారని మండిపడ్డారు. రాజధానిపై మంత్రులు ధర్మాన, బొత్స ఇప్పుడు మాట్లాడటం ఏంటని ప్రశ్నించారు. సజ్జల ఎలా మాట్లాడమంటే అలా మాట్లాడతారా అని అడిగారు. విశాఖలో రూ.25 వేల కోట్ల ఆస్తులను తాకట్టు పెట్టారని ఆరోపించారు.విశాఖ పరిరక్షణ కమిటీ ఛైర్మన్ పేరుతో ఏం పరిరక్షిస్తారో చెప్పాలని అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement