Friday, May 3, 2024

ఈ వారం సినీ పండుగ‌.. ఒటిటి, థియేటర్లలో రిలీజ్ అయ్యే సినిమాలేంటో తెలుసా

కరోనా తర్వాత ఇప్పుడిప్పుడే జనాలు థియేటర్లకు వెళ్తున్నారు. కొత్త సినిమాలు కూడా ఈ మధ్యనే ఎక్కువగా రిలీజ్ అవుతున్నాయి. అంతేకాకుండా 100 శాతం ఆక్యుపెన్సీకి ప్రభుత్వం పర్మిషన్ కూడా ఇచ్చింది. ఇంకేం సినీ అభిమానులకు, థియేటర్ల యజమానులకు పండుగే. థియేటర్లతో పాటు ఒటిటిల్లో రిలీజ్ అవుతున్న సినిమాలు కూడా ఉన్నాయి. థియేటర్లలో రిలీజై ఓటీటీల్లో ప్రేక్షకులని అలరించేందుకు కూడా కొన్ని రెడీగా ఉన్నాయి. ఈ వారం ఆడియన్స్‌ ముందుకు వస్తున్న సినిమాలపై ఓ లుక్‌ వేయండి.

‘నాట్యం’
ప్రముఖ కూచిపూడి నృత్యకారిణి సంధ్యారాజు నటిగా పరిచయమవుతూ సొంతంగా నిర్మిస్తున్న చిత్రం ‘నాట్యం’. రేవంత్‌ కోరుకొండ డైరెక్షన్లో వస్తున్న ఈ సినిమా అక్టోబర్‌ 22న థియేటర్లో విడుదల కానుంది. భరతనాట్యం నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రంలో కమల్‌కామరాజ్‌, రోహిత్‌ బెహల్‌, ఆదిత్య మేనన్‌ నటించారు.

అసలేం జరిగింది..
య‌ధార్థ ఘ‌ట‌న‌ల ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘అస‌లేం జ‌రిగింది’. శ్రీరామ్, సంచితా పదుకునే న‌టించిన ఈ మూవీ ఈ నెల 22న థియేటర్లలో విడుదల కానుంది. ఎన్వీఆర్ డైరెక్ట్ చేయగా, ఎక్స్‌డోస్ మీడియా పతాకంపై మైనేని నీలిమా చౌదరి, కింగ్ జాన్సన్ కొయ్యడ నిర్మించారు. ఓ అదృశ్య శక్తితో చేసిన పోరాటమే ఈ చిత్రమని, 1970- 80ల్లో తెలంగాణలో జరిగిన వాస్తవిక ఘటనల‌ ఆధారంగా రూపొందించినట్లు చిత్ర బృందం పేర్కొంది.

- Advertisement -

మధుర వైన్స్‌..
కొత్త నటీనటులు సన్నీ నవీన్‌, సీమా చౌదరీ మెయిన్ క్యారెక్టర్లలో నటించిన చిత్రం ‘మధురవైన్స్‌’. యూత్‌ఫుల్‌ లవ్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ మూవీని జయకిషోర్ డైరెక్ట్ చేశారు. అక్టోబరు 22న ప్రేక్షకుల ముందుకు రానుంది. మద్యానికి బానిసైన ఓ యువకుడిగా సన్నీ నవీన్‌, అసలు మద్యం తాగే వాళ్లంటే అసహ్య పడే యువతిగా సీమా చౌదరి నటించారు. వీళ్లద్దరి మధ్య ప్రేమ ఎలా చిగురించింది అనేది ఈ చిత్రం కథ.

‘లవ్‌స్టోరీ’
శేఖ‌ర్ క‌మ్ముల దర్శకత్వంలో నాగచైతన్య-సాయి పల్లవి నటించిన చిత్రం ‘లవ్‌స్టోరీ’. సెప్టెంబరులో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మంచి టాక్ తెచ్చుకుంది. సినిమాలో నాగచైతన్య నటన సాయిపల్లవి చేసిన డ్యాన్స్‌ ప్రేక్షకుల ఆకట్టుకుంది. ఇక హీరోహీరోయిన్ల కెమిస్ట్రీకి వారి ఫ్యాన్స్‌ ఫిదా అయ్యారు. ఇప్పుడు ఈ సినిమా ఆహా ఒటిటిలో రాబోతుంది. అక్టోబరు 22న సాయంత్రం 6గంటల నుంచి ‘లవ్‌స్టోరీ’ అందుబాటులో ఉండనుంది.

‘హెడ్స్‌ అండ్‌ టేల్స్‌’
సునీల్‌, సుహాస్‌ చాందిని రావు, దివ్య శ్రీపాద, శ్రీ విద్య ప్రధాన పాత్రల్లో తెరకెక్కించిన చిత్రం ‘హెడ్స్‌ అండ్‌ టేల్స్‌’. ‘కలర్ ఫొటో’ ఫేమ్ సందీప్ రాజ్ కథ అందించారు. నటుడు సాయి కృష్ణ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సునీల్‌ కీలక పాత్ర పోషిస్తు‍న్నారు. షూటింగ్‌ను పూర్తి చేసుకున్న ఈ సినిమా ‘జీ 5’లో అక్టోబరు 22 నుంచి స్ట్రీమింగ్‌ కానుంది. ముగ్గురు మహిళలు తమ జీవితంలో ఎదుర్కొన్న సమస్యల్ని ఎలా పరిష్కరించుకున్నారనేదే కథాంశం.

Advertisement

తాజా వార్తలు

Advertisement