Sunday, April 28, 2024

యాద్రాద్రికి సీఎం కేసీఆర్..

ముఖ్య‌మంత్రి కేసీఆర్ యాదాద్రి ప‌ర్య‌ట‌న‌కు వెళ్ల‌నున్నారు. మంగళవారం(అక్టోబర్ 19) హైద‌రాబాద్ నుంచి ఉద‌యం 11:30 గంట‌ల‌కు యాదాద్రి బ‌య‌ల్దేర‌నున్నారు. యాదాద్రి పుణ్యక్షేత్రం పునర్నిర్మాణం పనులు పూర్తిస్థాయిలో ముగిసిన నేపథ్యంలో అన్నీటిని మరోసారి సిఎం కెసిఆర్ పరిశీలిస్తారు. ఈ సంద‌ర్భంగా యాదాద్రి పునఃప్రారంభ తేదీల‌ను సీఎం కేసీఆర్ ప్ర‌క‌టించ‌నున్నారు. యాదాద్రి పున: ప్రారంభం తేదీ ముహూర్తాన్ని ఇప్పటికే చినజీయర్ స్వామి నిర్ణయించారు. ఈ నేప‌థ్యంలో యాదాద్రిలోనే ఆలయ పున:ప్రారంభం తేదీలను కేసీఆర్ స్వయంగా ప్రకటిస్తారు. పున: ప్రారంభం సందర్భంగా నిర్వహించనున్న మహా సుదర్శన యాగం వివరాలను, తేదీలను కూడా సీఎం కేసీఆర్ ప్ర‌క‌టించ‌నున్నారు.

ఇది కూడా చదవండి: సిటీ బాట పట్టిన జనం.. ఊళ్లకు పోయినోళ్లు తిరిగొస్తున్నరు

Advertisement

తాజా వార్తలు

Advertisement