Monday, April 29, 2024

దిసీజ్ ఇన్ క్రెడిబుల్‌.. ఒక్క‌సారే 12 బిందెల‌తో నీళ్లు తేవ‌డ‌మా!

అది రాజస్థాన్‌లో ఓ ఎడారి ప్ర‌దేశం.. అక్క‌డి మ‌హిళ‌లు తాగునీటి కోసం సుదూర ప్రాంతాల‌కు వెళ్తుంటారు. చాలా దూరం వెళ్లి నీటిని తెచ్చుకోవాల్సి ఉంటుంది. పైగా స‌రైన దారి ఉండ‌దు. అంతా ఇసుక మేట‌లున్న దారి. దీంతో వారు మ‌ళ్లీ మ‌ళ్లీ అంత దూరం వెళ్లి నీరు తెచ్చుకోవాలంటే క‌ష్టంగా ఉంటుంది.

అందుక‌ని అక్క‌డి మ‌హిళ‌లు బిందెపై బిందె.. ఇట్లా పన్నెండు బిందెల‌ను త‌ల‌మీద పెట్టుకుని నీరు తెచ్చుకుంటున్న ఫొటో ఒక‌టి ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. ఈ ఫొటోను టీఆర్ ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌కు ట్యాగ్ చేశాడో వ్య‌క్తి. ఇట్లా చాలాంది లైక్ చేస్తూ వారి క‌ష్టాలు పోయే మార్గం ఉందా అని ప్ర‌శ్నిస్తున్నారు. దాంతోపాటే ఆ మ‌హిళ‌ల తెగువ‌.. వారి ఆలోచ‌న‌కు హ్యాట్సాఫ్ అంటూ.. కామెంట్ చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement