Wednesday, May 8, 2024

IPL | ప్రీతిజింతా విజయోత్సాహం.. ఇన్​స్టాలో లవ్​లీ ఫొటో

IPL-2023లో కోల్‌కతా నైట్ రైడర్స్ తో జరిగిన మ్యాచ్​లో పంజాబ్ కింగ్స్ విజయం సాధించింది. దీంతో ఆ టీమ్​ ఓనర్​ అయిన నటి, ప్రీతీ జింతా స్టాండ్స్ నుండి తన టీమ్​ని ఎంకరేజ్​ చేస్తూ కనిపించింది. ఇక.. తన జట్టు పంజాబ్ కింగ్స్ విజయవంతమైన ప్రారంభం ఇవ్వడంతో ప్రీతి ఇన్‌స్టాగ్రామ్‌లో తన ఆనందాన్ని వ్యక్తం చేసింది.

“ఇంటికి రావడం లాంటిదేమీ లేదు. ఇంత సాదరంగా స్వాగతించినందుకు ఇంట్లో ఉన్న పంజాబీలందరికీ ధన్యవాదాలు. మొహాలీకి తిరిగి రావడానికి మేము 4 సంవత్సరాలు ఎదురుచూశాము. ఈ ఐపీఎల్ సీజన్‌ని విజయంతో ప్రారంభించినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది” అని ఇన్​స్టాలో రాసుకొచ్చింది. ఓ మెస్సరైజింగ్​ ఫొటోను కూడా అభిమానులతో షేర్​ చేసుకుంది. ఈ ఫొటోలో ఆమె తన చిరునవ్వుతో మెరుస్తూ కనిపించడం చూడొచ్చు.

కాగా, కోల్‌కతా నైట్ రైడర్స్ పై పంజాబ్ కింగ్స్ ఏడు పరుగుల తేడాతో విజయం సాధించింది. పంజాబ్ కింగ్స్ ఐదు వికెట్ల నష్టానికి 191 పరుగులు చేయగా.. కోల్‌కతా నైట్ రైడర్స్ 192 పరుగుల విజయ లక్ష్యాన్ని ఛేదించాలని భావించారు. అయితే.. మొహాలీలో భారీ వర్షం కారణంగా పంజాబ్‌ను DLS పద్ధతిలో విజేతగా ప్రకటించారు. కాగా, ఏప్రిల్ 5న బర్సపరా స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్ తో పంజాబ్ కింగ్స్ ఆడనుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement