Wednesday, May 1, 2024

Breaking: ఖమ్మంలో దొరికిన రూ.7కోట్ల నగల దొంగ

రూ.7కోట్ల వజ్రాభరణాలతో పరారైన కారు డ్రైవర్ ను పోలీసులు పట్టుకున్నారు. కారు డ్రైవర్ రూ. 7 కోట్ల విలువైన వజ్రాభరణాలతో మూడు రోజుల క్రితం పరారయ్యాడు. హైదరాబాద్‌లోని మాదాపూర్‌లోని మైహోం భుజ అపార్ట్‌మెంట్స్‌లో ఉండే రాధిక ఆభరణాల వ్యాపారం చేస్తుంటారు. అదే అపార్ట్‌మెంట్స్‌లో ఉండే అనూష రూ.50 లక్షల విలువ చేసే ఆభరణాలను ఆర్డర్ చేశారు. మధురానగర్‌లో బంధువుల ఇంటికి వెళ్లిన అనూష నగలను అక్కడికే పంపమని చెప్పారు. దీంతో రాధిక తన కారులో డ్రైవర్ శ్రీనివాస్ (26), సేల్స్‌మెన్ అక్షయ్ (30)లతో ఆ నగలను పంపారు.

మధురానగర్ చేరుకున్న తర్వాత డ్రైవర్ శ్రీనివాస్ కారులో ఉండగా, అక్షయ్ నగలను తీసుకెళ్లి అనూషకు ఇచ్చి తిరిగి వచ్చి చూస్తే కారు లేదు. సిరిగిరిరాజు జెమ్స్ అండ్ జువెల్లర్స్‌కు ఇవ్వాల్సిన రూ.7 కోట్ల విలువైన వజ్రాభరణాలు కారులోనే ఉన్నాయి. శ్రీనివాస్ ఆ నగలతో పరారయ్యాడు. అక్షయ్ వెంటనే విషయాన్ని రాధికకు తెలపడంతో ఆమె ఎస్సార్ నగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు డ్రైవర్ కోసం గాలిస్తుండగా ఖమ్మంలో ఈరోజులు పోలీసులు పరారైన శ్రీనివాస్ ను పట్టుకున్నారు. రూ.7కోట్ల విలువైన బంగారు ఆభరణాలను సీజ్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement