Friday, April 26, 2024

ఇప్ప‌టి వ‌ర‌కు రైల్వే ట్రాక్ లేని రాష్ట్రం.. ఎక్క‌డో తెలుసా

ఆ రాష్ట్రంలో అస‌లు రైల్వే ట్రాకే లేద‌ట‌. ఎక్క‌డ అనుకుంటున్నారా..మ‌న ఇండియాలోనే..ఈశాన్య రాష్ట్రం సిక్కింలో ఒక్క రైల్వే స్టేషన్ కూడా లేదట. ఇప్పటిదాకా ఒక్క ట్రైన్ కూడా నడవలేదట. అక్కడి భౌగోళిక పరిస్థితుల వల్ల రైల్వే ట్రాక్ ను ఏర్పాటు చేయలేదు. మొత్తం పర్వత ప్రాంతాలతో నిండి ఉండటం.. అక్కడ రైల్వే లైను వేసేందుకు కావాల్సినంత టెక్నాలజీ గతంలో లేకపోవడంతో రైలు రవాణా అనేదే సిక్కింలో లేకుండా పోయింది. దీంతో రవాణా ఎక్కువగా రోడ్డు మార్గంలోనే సాగుతుంది.
2008లో మాత్రం ఓ అడుగు పడింది. పశ్చిమ బెంగాల్ ను సిక్కింతో కలిపేందుకు సివోక్, రాంగ్ పో మధ్య రైలు మార్గం నిర్మించాలని రైల్వే శాఖ ప్రణాళిక వేసింది.

అభయారణ్యాలు ఉండటం, కొండ చరియలు విరిగిపడే ప్రమాదం ఉండటం, నిధుల కేటాయింపులో జాప్యం కారణంగా ప్రాజెక్టు ముందుకు సాగలేదు.అయితే 2016లో అన్ని అడ్డంకులు తొలగిపోవడంతో పనులు వేగవంతమయ్యాయి. 2021 నాటికి రైల్వే ప్రాజెక్టు ప్రారంభం కావాల్సింది. కానీ కరోనా వల్ల ఆలస్యమైంది. ప్రస్తుతం పనులు శరవేగంగా జరుగుతున్నాయి. త్వరలోనే రైల్వే లైన్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. అక్కడ తొలిసారి రైలు కూత పెట్టనుంది. త్వరలో రెండో దశలో గ్యాంగ్ టక్ కు రైళ్ల సర్వీసులను ప్రారంభించే దిశగా చర్యలు చేపడతామని అధికారులు చెబుతున్నారు.చూడాలి మ‌రి 2023లో అయినా ఆ రాష్ట్రంలో రైలు కూత‌పెడుతుందో లేదో.

Advertisement

తాజా వార్తలు

Advertisement