Thursday, May 2, 2024

అదుపుత‌ప్పి బోల్తా ప‌డిన పిక‌ప్ వ్యాన్.. ఐదుగురు దుర్మ‌ర‌ణం

పెళ్లికి వెళ్లి తిరిగి వ‌స్తుండ‌గా ఓ పిక‌ప్ వ్యాన్ అదుపుత‌ప్పి బోల్తా ప‌డింది.ఈ ప్ర‌మాదంలో ఐదుగురు దుర్మ‌ర‌ణం చెందారు. మరో 11 మంది తీవ్రంగా గాయపడ్డారు. జార్ఖండ్‌లోని గుమ్లాలో ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను సమీపంలోని దవాఖానకు తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు. ప్రమాద సమయంలో వ్యాన్‌లో సుమారు 50 మంది ఉన్నారని చెప్పారు. దుమ్రిలోని సరాన్‌దిహ్‌లో జరిగిన వివాహ వేడుకకు హాజరై తిరిగి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు వెల్లడించారు. జార్దా గ్రామ సమీపంలో అదుపుతప్పిన వ్యాన్‌.. బోల్తా పడిందని, మూడుసార్లు పల్తీలు కొట్టడంతో ఐదుగురు మృతిచెందారని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement