Wednesday, May 1, 2024

Breaking: గుజరాత్‌ ఘటనలో 60కి చేరిన మృతుల సంఖ్య.. ప్రకటించిన మంత్రి బ్రిజేష్ మెర్జా

గుజరాత్ కేబుల్ బ్రిడ్జి కూలిపోయిన ఘటనలో మృతుల సంఖ్య గంట గంటకు పెరుగుతోంది. ఇప్పటివరకు 35 మంది చనిపోయినట్టు మృతదేహాలను గుర్తించారు. అయితే.. ఇప్పుడు అందుతున్న తాజా వార్తల ప్రకారం.. 60 మంది మృతదేహాలు బయటికి తీసినట్టు తెలుస్తోంది. ఈ వివరాలను మంత్రి బ్రిజేష్ మోర్జా మీడియాకు అందించారు. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. వందల సంఖ్యలో గాయపడ్డారు.

కాగా, మూడు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ పరిస్థితిని పర్యవేక్షిస్తున్న సమయంలో ప్రధాని మోదీ బాధితులకు ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. కేంద్రం నుంచి 2 లక్షలు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి 4 లక్షల ఎక్స్గ్రేషియా అందజేయనున్నట్టు ప్రకటించారు. గాయాలపాలైన క్షతగాత్రులకు 50వేల రూపాయల చొప్పున అందిస్తామని గుజరాత్​ సీఎం ప్రకటించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement