Sunday, April 28, 2024

Breaking: ములుగులో ఘోర రోడ్డుప్రమాదం.. టాటా ఏస్‌ని ఢీకొట్టిన లారీ, డ్రైవ‌ర్ మృతి

ములుగు, (ప్రభా న్యూస్ ప్రతినిధి) : ములుగు జిల్లా మహ్మద్ గౌస్ పల్లి సమీపంలో ఘోర రోడ్డుప్రమాదం చోటు చేసుకుంది. ఈ రోడ్డు యాక్సిడెంట్‌లో ఒకరు అక్కడికక్కడే చ‌నిపోయారు. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. శుక్రవారం సాయంత్రం టీ ఎస్ 04 యూ ఏ 8278 నెంబర్ గల టాటా ఏస్‌ వాహనం ములుగు వైపు వస్తుండగా ఎదురుగా వస్తున్న టీ ఎస్ 07 యు జి 7759 నెంబరు గల ఇసుక లారీ ఓవర్ స్పీడ్ తో ఓవర్ టేక్ చేస్తూ టాటా ఏస్‌ని డీకొట్టింది. దీంతో డ్రైవర్ అక్కడికక్కడే మృతిచేందాడు. మరొకరికి తీవ్ర గాయాలవ్వగా ములుగు ఏరియా ఆసుపత్రి కి తరలించారు.

స్థానికుల నుండి సమాచారం అందుకున్న పోలీసులు ఎస్ ఐ ఓంకార్, సెకండ్ ఎస్ ఐ లక్ష్మారెడ్డి సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ములుగు ఏరియా ఆసుపత్రి కి తరలించారు. లారీ అతివేగమే ప్రామాదానికి కారణమని పోలీసులు బావిస్తున్నారు. చ‌నిపోయిన వ్య‌క్తిని జంగాలపల్లి గ్రామానికి చెందిన నీలం శ్యామ్ గా గుర్తించారు. దీంతో ఆ గ్రామంలో తీవ్ర విషాదం అలుముకుంది. బాధితుల కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement