Saturday, April 20, 2024

ఆర్టీసీ బస్సులో ట్రిపుల్ ఆర్‌ సినిమా బృందం.. స‌జ్జ‌నార్ సూచ‌న‌తో ప్ర‌మోష‌న్‌

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : ప్రపంచవ్యాప్తంగా విడుదలైన త్రిబుల్‌ ఆర్‌ సినిమా బాక్సాఫీస్‌ను షేక్‌ చేస్తోంది. తెలుగు రాష్ట్రాల్లోని ఏ థియేటర్‌ ముందు చూసినా జనం టికెట్ల కోసం క్యూలు కట్టి కనిపించారు. కొన్ని థియేటర్లు హౌజ్‌ ఫుల్‌ బోర్డులను ప్రదర్శిస్తున్నాయి. ఇదిలా ఉండగా ఈ సినిమా టీం శుక్రవారం ఆర్టీసీ భస్సులో ప్రయాణం చేసింది. ఆర్టీసీని ప్రమోట్‌ చేసేందుకు సంస్థ ఎండీ సజ్జనార్‌ తీసుకున్న చొరవతో సినిమా బృందం సభ్యులందరూ బస్సులో ప్రయాణం చేశారు.

సినిమాతో పాటు టీఎస్‌ఆర్‌టీసీని ప్రమోట్‌ చేయవచ్చన్న ఉద్దేశంతో సజ్జనార్‌ చేసిన సూచనకు సినిమా బృందం అంగీకరించింది. దీంతో వీరి కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. ఈ బస్సుల్లో ప్రయాణించిన రాజమౌళి, జూనియర్‌ ఎన్టీఆర్‌, రాంచరణ్‌ తదితరులు కూకట్‌పల్లిలోని భ్రమరాంబథియేటర్‌కు చేరుకున్నారు. ఈ సందర్భంగా సజ్జనార్‌ ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా టీంకు ధన్యవాదాలు తెలిపారు. సినిమా బృందం కూడా టీఎస్‌ఆర్‌టీసీకి కృతజ్ఞతలు తెలిపింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement