Thursday, May 2, 2024

హైదరాబాద్ చేరుకున్న తెలుగు విద్యార్థులు

ఉక్రెయిన్ నుంచి భారత్‌కు వచ్చిన తెలుగు విద్యార్థులు.. శంషాబాద్ విమానాశ్రయం చేరుకున్నారు. శనివారం బుకారెస్ట్ నుంచి ముంబై చేరుకున్న విమానంలో 219 మంది భారతీయులు ఉన్నారు. ఆ తర్వాత ఢిల్లీ వచ్చిన మరో విమానంలో 250 మంది విద్యార్థులు ఉన్నారు.

ముంబై చేరుకున్న విమానంలో ఉన్న 20 మంది తెలుగు విద్యార్థులు శంషాబాద్ విమానాశ్రయంలో ల్యాండయ్యారు. అలాగే ఢిల్లీ చేరిన విమానంలో 17 మంది తెలుగు విద్యార్థులు ఉన్నారు.
ఈరోజు సాయంత్రానికి మరికొంతమంది తెలుగు విద్యార్థులు ఢిల్లీకి చేరుకునే అవకాశం ఉంది. 

Advertisement

తాజా వార్తలు

Advertisement