Monday, April 29, 2024

మాస్కు ధరించని వారికి హెచ్చరిక..

తెలంగాణలో కొవిడ్ పాజిటివ్ కేసులు భారీగా పెరిగిపోతోన్న నేప‌థ్యంలో మాస్కులు పెట్టుకోని వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ఎవ‌రైనా మాస్కు ధరించకపోతే రూ.1,000 జరిమానా విధించాల‌ని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణ‌యం తీసుకున్న విష‌యం తెలిసిందే. ప్ర‌భుత్వ ఆదేశాల‌ను పోలీసులు ప‌క్కాగా అమ‌లు చేస్తున్నారు. మాస్కు పెట్టుకోని వారిపై  డిజాస్టర్ మేనేజ్‌మెంట్ కింద జ‌రిమానా విధించ‌డ‌మే కాకుండా వారిపై కేసులు న‌మోదు చేసి, న్యాయ‌స్థానంలో హాజరు కావాలని పోలీసులు చెబుతున్నారు. ఈ నెల‌ 5వ తేదీ నుంచి 11వ తేదీ వరకు సుమారు 6,500 మందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. వారిలో అత్య‌ధిక మంది హైదరాబాద్, ప‌రిస‌ర ప్రాంతాల‌కు చెందిన వారే ఉన్నారు. హైదరాబాద్, సైబారాబాద్, రాచకొండ ప‌రిధిలో క‌లిపి మాస్క్‌లు ధరించని 3,500 మందిపై కేసులు నమోదుచేసిన‌ట్లు పోలీసులు చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement