Thursday, May 2, 2024

వానాకాలం వ‌డ్ల‌ కొనుగోళ్లలో టాప్ త్రీలో తెలంగాణ.. కేంద్ర ప్రజా పంపిణి మంత్రిత్వ శాఖ వెల్ల‌డి

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : ఖరీఫ్ ధాన్యం కొనుగోళ్లలో తెలంగాణ మూడోస్థానంలో నిలిచిందని కేంద్రం ప్రకటించింది. మొదటి రెండు స్థానాల్లో పంజాబ్, ఛత్తీస్‌గఢ్ ఉన్నాయని తెలిపింది. ఈ మేరకు కేంద్ర ప్రజా పంపిణి మంత్రిత్వ శాఖ సోమవారం ఓ ప్రకటన విడుదల చేసింది. 2021-22 ఖరీఫ్(వానాకాలం) సీజన్‌లో కేంద్రప్రభుత్వం దేశవ్యాప్తంగా 741.62 ఎల్ఎంటీ ధాన్యాన్ని కొనుగోలు చేసింది. పంజాబ్, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ, ఏపీ, గుజరాత్, మధ్యప్రదేశ్‌లతో సహా 24 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి ధాన్యాన్ని సేకరించింది.

ఇందుకోసం రూ.1,15,358 కోట్లను మద్దతు ధరగా చెల్లించింది. ధాన్యం కొనుగోలు ద్వారా దేశవ్యాప్తంగా 105.14 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరిందని ప్రకటనలో పేర్కొంది. పంజాబ్ నుంచి 1,87,28, 335 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయగా, ఛత్తీస్‌గఢ్ నుంచి 92,01, 000 మెట్రిక్ టన్నులు, తెలంగాణ నుంచి 70,22,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసింది. రూ.13,763 కోట్ల ఎంఎస్పీతో రాష్ట్రంలో 10,62,428 మంది రైతులకు లబ్ది చేకూరిందని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement