Saturday, May 4, 2024

అభివృద్ధిలో శిఖ‌రాగ్రానికి చేరిన తెలంగాణ – పెరుగుతోన్న తెలంగాణ త‌ల‌స‌రి ఆదాయం – సీఎం కేసీఆర్

హైద‌రాబాద్ ప‌బ్లిక్ గార్డెన్ లో తెలంగాణ ఆవిర్భావ దినోత్స‌వ వేడుక‌లు నిర్వ‌హించారు. ఈ వేడుక‌ల్లో సీఎం కేసీఆర్ పాల్గొని జాతీయ జెండాను ఆవిష్క‌రించారు. కాగా అనంత‌రం ఆయ‌న మాట్లాడారు.. తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో శిఖరాగ్రానికి చేరిందని అన్నారు. తెలంగాణ ప్రజలకు రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఎనిమిదేళ్ల స్వల్పకాలంలో తెలంగాణ రాష్ట్రం సాధించిన ప్రగతిని విశ్లేషించుకుంటే మనం సాధించిన ఘన విజయాలు ఎన్నో కళ్లముందు సాక్షాత్కరిస్తాయి. 75 సంవత్సరాల్లో దేశంలో ఏ రాష్ట్రం సాధించని విజయాలను 8ఏళ్లలో మన తెలంగాణ రాష్ట్రం సాధించింది. ప్రతి విషయంలో తెలంగాణ రాష్ట్రం అవతరించే నాటికి.. నేటి స్థితిగతులకు పోలికే లేదన్నది జగమెరిగిన సత్యం. ఆర్థికవృద్ధిలో, తలసరి ఆదాయం పెరుగులలో, విద్యుత్‌ సరఫరా, తాగు, సాగునీటి సదుపాయం, ప్రజసంక్షేమం, పారిశ్రామిక, ఐటీ రంగాలతో పాటు అనేక రంగాల్లో రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలువడం మనందరికీ గర్వకారణం.

అస్థిత్వం కోసం 60 సంవత్సరాలు పోరాడిన తెలంగాణ నేడు అభివృద్ధిలో శిఖరాగ్రానికి చేరి నేడు ప్రపంచం ముందు సగర్వంగా నిలిచింది. ఎనిమిదేళ్ల స్వల్పకాలంలో దేశానికే దిశానిర్దేశం చేసే కరదీపగా మారింది. ప్రజలందరి దీవెన, ప్రభుత్వ సిబ్బంది అంకితభావం వల్లనే ఇదంతా సాధ్యపడిందనేది నిస్సందేహమైన విషయం. కఠిన, పటిష్టమైన ఆర్థిక క్రమశిక్షణతో ఆదాయ వనరులను పెంచుకున్నాం. 2014-2019 వరకు 17.24శాతం సగటు ఆర్థిక వృద్ధిరేటుతో తెలంగాణ దేశంలో అగ్రస్థానంలో నిలిచిందన్నారు సీఎం కేసీఆర్. ఎన్నో అవరోధాలు ఎదురైనా, కరోనా వంటి విపత్తులు ఎదురవుతున్నా తెలంగాణ రాష్ట్రం ప్రగతి పథంలో దూసుకుపోతున్నది. కరోనా సృష్టించిన సంక్షోభం నుంచి అతిత్వరగా తెలంగాణ కోలుకున్నదని భారత ఆర్థిక సర్వే 2020-21 అభినందించడం.. తెలంగాణ ఆర్థిక నిర్వహణ దక్షతకు దక్కినటువంటి గుర్తింపు. 2013-14లో తెలంగాణ ఏర్పడిననాడు రాష్ట్ర జీఎస్‌డీపీ రూ.5,05,849 కాగా.. 2021-22 నాటికి రూ.11,54,860కోట్లకు చేరింది. పెరిగిన ఆదాయంలో ప్రతి పైసా సద్వినియోగమయ్యే విధంగా ప్రభుత్వం జాగ్రత్తగా ప్రణాళికాబద్ధంగా పెట్టుబడి వ్యయం చేస్తున్నది. తలససరి ఆదాయం పెరుగుదలలో కూడా తెలంగాణ రాష్ట్రం రికార్డు సాధించింది. 2014-15లో రాష్ట్ర తలసరి ఆదాయం రూ.1,24,124 కాగా.. 2021-22 నాటికి రూ.2,78,833కు పెరిగింది. జాతీయ సగటు ఆదాయమైన రూ.1,49,848 కంటే ఇది 86శాతం ఆదాయం. జాతీయ తలసరి ఆదాయం కంటే తెలంగాణ తలసరి ఆదాయం రోజు రోజుకు పెరుగుతుండడం శుభపరిణామ‌మ‌ని కేసీఆర్ వెల్ల‌డించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement