Friday, May 17, 2024

ఆసుప‌త్రి క్యాంప‌స్ భ‌వ‌నంలో కాల్పులు – దుండ‌గుడితో స‌హా న‌లుగురు మృతి

అమెరికా ఓక్ల‌హామా రాష్ట్రం తుల్సాలోని సెయింట్ ఫ్రాన్సిస్ ఆసుప‌త్రి క్యాంప‌స్ భ‌వ‌నంలోకి ఓ దుండ‌గుడు ప్ర‌వేశించి కాల్పులు జ‌రిపాడు. ఈ ఘటనలో ముగ్గురు పౌరులు ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. కాల్పులు జరిపిన దుండగుడు కూడా చనిపోయినట్టు స‌మాచారం. అయితే, అతడిని పోలీసులు మట్టుబెట్టారా లేక, అతడే తనను తాను కాల్చుకుని మృతి చెందాడా అనే విషయంలో స్పష్టత లేదు. కాల్పులు జరిపిన వ్యక్తి సహా మొత్తం నాలుగు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement