Thursday, May 16, 2024

అమరుల ఆశ‌యాల‌కు అనుగుణంగా రాష్ట్రం పురోగ‌మిస్తుంది – మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి

నిర్మ‌ల్ లోని శాస్త్రిన‌గ‌ర్ లో ఉన్న త‌న క్యాంప్ కార్యాల‌యంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్స‌వ వేడుక‌లు జ‌రిపారు మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి. తెలంగాణ రాష్ట్రం ఎనిమిది వసంతాలు పూర్తి చేసుకుని తొమ్మిదో వసంతంలోకి అడుగుపెట్టిన సందర్భంగా ఇంద్రకరణ్‌ రెడ్డి రాష్ట్ర ప్రజ‌ల‌కు శుభాకాంక్షలు తెలిపారు. తన క్యాంప్ కార్యాల‌యంలో జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అమరుల ఆశయాలకు అనుగుణంగా రాష్ట్రం పురోగమిస్తున్నదని తెలిపారు. దేశానికి ఆదర్శంగా తెలంగాణ నిలుస్తుందని వెల్లడించారు. నీళ్లు, నిధులు, నియామకాలు అనే నినాదంతో తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిందని, ప్రస్తుతం అవన్నీ సాకారం అవుతుండటం హర్షణీయమన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement