Saturday, April 27, 2024

Good News: ఇల్లు కట్టుకునే వారికి ఆర్థిక సాయం.. రూ.5 లక్షలు ఇవ్వనున్న ప్రభుత్వం

పేద ప్రజలకు తెలంగాణ ప్రభుత్వం మరో శుభవార్త అందించనుంది. పేద ప్రజల కోసం ఇప్పటికే అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న కేసీఆర్ సర్కార్.. తాజాగా సొంత స్థలం ఉండి.. ఇల్లు కట్టుకునే వారికి కేసీఆర్‌ సర్కార్‌ ఆర్థిక సాయం చేసేందుకు నిర్ణయించింది. సొంత స్థలం ఉండి.. ఇల్లు కట్టుకునే వారికి రూ.5 లక్షలు ఇవ్వాలని గత అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ మానిఫెస్టోలో పొందుపరిచింది. దానికి అనుగుణంగా ప్రభుత్వం ఈ బడ్జెట్ లో ఆర్థిక సాయం చేసేందుకు నిధులు కేటాయించనుంది. అందులో భాగంగానే వచ్చే బడ్జెట్‌ లో దీనిపై ప్రకటన చేయనుంది. ఏప్రిల్‌ నుంచే ఈ పథకాన్ని ప్రారంభించాలని ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది.

కాగా,టీఆర్ఎస్ ప్రభుత్వం పేద ప్రజల సొంతింటి కళను నిజం చేయడానికి డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement