Thursday, May 9, 2024

‘సర్కారు వారి పాట’: టికెట్ల ధరలు పెంచుకునేందుకు అనుమతి

సూపర్ స్టార్ మహేశ్ బాబు, క్యూట్ బ్యూటీ కిర్తి సురేష్ కాంబినేషన్ లో తెరకెక్కిన మూవీ ‘సర్కారు వారి పాట’. పరశురామ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం మే 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తెలంగాణలో టికెట్ల ధరలు పెంచుకునేందుకు ‘సర్కారు వారి పాట’ చిత్రానికి అనుమతి లభించింది. 

రాష్ట్రంలోని మల్టీప్లెక్స్ లు, సింగిల్ స్క్రీన్ థియేటర్లలో టికెట్ ధరలపై రూ.50 పెంచుకునేందుకు ప్రభుత్వం అనుమతించింది. ఎయిర్ కండిషన్డ్, ఎయిర్ కూల్డ్ థియేటర్లలో టికెట్ ధరపై రూ.30 పెరగనుంది. అలాగే, ‘సర్కారు వారి పాట’ చిత్రం అదనపు ప్రదర్శనలకు కూడా ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. కాగా, ‘సర్కారు వారి పాట’ చిత్రానికి టికెట్ల ధరలు పెంచుకునేందుకు అటు ఏపీలోనూ అనుమతి లభించిన తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement