Saturday, April 27, 2024

త్యాగం అంటే ప‌వ‌న్‌ను సీఎం చేస్తారా?: చంద్రబాబుపై స‌జ్జ‌ల ఫైర్

ఏపీలో వ‌చ్చే ఎన్నికల్లో రాజ‌కీయ పార్టీల పొత్తులపై ఏపీ ప్ర‌భుత్వ ముఖ్య స‌ల‌హాదారు స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి సోమ‌వారం నాడు స్పందించారు. ఈ సంద‌ర్భంగా తాను త్యాగం చేసేంకుకు సిద్ధ‌మంటూ టీడీపీ అధినేత నారా చంద్ర‌బాబు చేసిన వ్యాఖ్య‌ల‌పై కీలక వ్యాఖ్యలుచేశారు. చంద్ర‌బాబే త్యాగం అంటే జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్‌ను ముఖ్య‌మంత్రిని చేస్తారా? అని సజ్జల ప్ర‌శ్నించారు. ఒక‌రు త్యాగాల‌కు సిద్ధ‌మంటారు.. మరొక‌రు తానే సీఎం అంటున్నారు..ఇంకొక‌రేమో తాము క‌ల‌వ‌మంటార‌ని ఎద్దేవా చేశారు. టీడీపీ, జనసేనకు రాజకీయ అవసరాలే తప్ప ప్రజాప్రయోజనాలు వాళ్లకు అవసరం లేదని మండిపడ్డారు. చంద్రబాబు చేసిన జంప్‌లు అందరికీ తెలుసన్నారు. ప్రజలంటే చంద్రబాబుకు చులకన ఎందుకని ప్రశ్నించారు. చంద్ర‌బాబు డైరెక్షన్ లోనే ప‌వ‌న్ క‌ల్యాణ్ న‌డుస్తున్నార‌ని ఆరోపించారు. ప‌వ‌న్ డైలాగుల‌న్నీ చంద్ర‌బాబు చెబుతున్న‌వేన‌ని సజ్జల ఎద్దేవా చేశారు. చంద్ర‌బాబు, ప‌వ‌న్ ఇప్ప‌టికీ పొత్తులోనే ఉన్నార‌న్న సజ్జల.. ప్రజాప్రభుత్వాన్ని గద్దె దించే కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. విపక్షాలు పగటి కలలు కంటున్నాయని పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement