Sunday, May 12, 2024

రెండో వన్డేలో టీమిండియా ఘనవిజయం… సిరీస్ కైవసం

విండీస్ తో అహ్మదాబాద్ లో జరిగిన రెండో వన్డేలో టీమిండియా 44 పరుగులతో ఘనవిజయం సాధించింది. 238 పరుగుల విజయలక్ష్యంతో బరిలో దిగిన వెస్టిండీస్ ను 193 పరుగులకే ఆలౌట్ చేసింది. ఈ విజయంలో ఫాస్ట్ బౌలర్ ప్రసిద్ధ్ కృష్ణ ప్రధాన భూమిక పోషించాడు. ప్రసిద్ధ్ 12 పరుగులు ఇచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. శార్దూల్ ఠాకూర్ 2, సిరాజ్ 1, చహల్ 1, సుందర్ 1, హుడా 1 వికెట్ తీశారు. వెస్టిండీస్ జట్టులో షామ్రా బ్రూక్స్ అత్యధికంగా 44 పరుగులు సాధించాడు.

లోయర్ ఆర్డర్ లో అకీల్ హోసీన్ (34), ఓడియన్ స్మిత్ (24) రాణించినా అది కాసేపే అయింది. భారత బౌలర్ల ధాటికి ఆ జట్టు 46 ఓవర్లలోనే ఆలౌట్ అయింది. ఈ విజయంతో టీమిండియా 3 వన్డేల సిరీస్ ను 2-0తో కైవసం చేసుకుంది. ఇక ఈ నెల 11న ఇరు జట్ల మధ్య మూడో వన్డే జరగనుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement