Friday, May 3, 2024

కేటీఆర్ తో గంటా భేటీ

తెలంగాణ ఆసెంబ్లీ వద్ద అసక్తికర దృశ్యం కనిపించింది. అసెంబ్లీ లాబీలో ఏపీ టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాస రావు తెలంగాణ మంత్రి కేటీఆర్ తో భేటీ అయ్యారు. విశాఖ ఉక్కు ఉధ్యమానికి కేటీఆర్ మద్దతు ఇచ్చిన నేపథ్యంలో ఈ ఇద్దరు నేతల భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. ప్రస్తుతం ఏపీలో విశాఖ ఉక్కు ఉద్యమం తీవ్ర తరం అవుతోంది. ఈ అంశంపైనే ఇద్దరు నేతలు చర్చించిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా, ఇటీవల విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ అంశంపై తాము కచ్చితంగా మాట్లాడతామని తెలంగాణ మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్న సంగతి తెలిసిందే. భవిష్యత్తులో రాష్ట్ర ప్రభుత్వాలను కూడా ప్రైవేటుపరం చేస్తారేమో అని ఆయన కేంద్రంపై మండిపడ్డారు. విశాఖ ఉక్కు ఈ దేశంలో లేదా ? అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. పక్క రాష్ట్రం వారికి కష్టం వచ్చినప్పుడు తాము మాట్లాడితే బీజేపీకి ఎందుకంత బాధ అని కేటీఆర్ ప్రశ్నించారు. పక్క రాష్ట్రాల వారికి కష్టం వచ్చినప్పుడు మేం మాట్లాడకపోతే.. తమకు కష్టం వచ్చినప్పుడు ఎవరు మద్దతిస్తారని అన్నారు. సింగరేణిని ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేటుపరం కానివ్వబోమని కేటీఆర్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement