Monday, May 6, 2024

త‌మిళ క‌మెడియ‌న్ ‘వ‌డివేలు’కి క‌రోనా – రామ‌చంద్రా హాస్ప‌ట‌ల్ లో చికిత్స‌

క‌రోనా పంజా విసురుతూనే ఉంది. ఎక్కువ‌గా సెల‌బ్రిటీలు క‌రోనా బారిన ప‌డుతూనే ఉన్నారు. కాగా త‌మిళ క‌మెడియ‌న్ వ‌డివేలు క‌రోనా బారిన ప‌డ్డారు. క‌రోనా టెస్ట్ చేయ‌గా ఆయ‌న‌కి పాజిటీవ్ గా నిర్థార‌ణ అయింది. కాగా చెన్నైలోని రామ‌చంద్రా హాస్ప‌ట‌ల్ లో చేరారు. ‘నాయి శేఖర్ రిటర్న్స్’ అనే సినిమాకు లోకేషన్ల, ఆర్టిస్టుల ఎంపిక కోసం వడివేలు, డైరెక్టర్ సూరజ్, నిర్మాత లైకా ఉమేశ్ లండన్ వెళ్లారు. లండన్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత వడివేలులో కోవిడ్ లక్షణాలు కనిపించాయి. దీంతో ఆయనకు వైద్యులు కోవిడ్ టెస్టులను నిర్వహించారు. ఈ టెస్ట్ ల‌లో వ‌డివేలుకి క‌రోనా అని తేలింది. ప్ర‌స్తుతం ఆయ‌న చికిత్స తీసుకుంటున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement