Thursday, May 2, 2024

T20 World Cup: భారత్ తో పాకిస్థాన్ ‘ఢీ’

టీ20 ప్రపంచకప్‌లో ఆదివారం రసవత్తర పోరు జరగనుంది. క్రికెట్ అభిమానులు ఎంతో అత్రుతగా ఎదురు చూస్తున్న చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్థాన్ జట్లు తలపడనున్నాయి. దుబాయ్ వేదికగా ఈ మ్యాచ్ ఆదివారం రాత్రి 7:30 గంటలకు జరగనుంది. ఈ నేపథ్యంలో భారత్‌తో తలపడే తుది జట్టును పాకిస్థాన్ ఒకరోజు ముందే ప్రకటించింది. 12 మంది సభ్యులతో పాకిస్థాన్ జట్టును ప్రకటించారు. బాబర్ ఆజమ్ (కెప్టెన్), అసిఫ్ అలీ, ఫకార్ జమాన్, హైదర్ అలీ, మహ్మద్ రిజ్వాన్, ఇమాద్ వసీమ్, మహ్మద్ హఫీజ్, షాదాబ్ ఖాన్, షోయబ్ మాలిక్, హరీస్ రౌఫ్, హసన్ అలీ, షహీన్ షా అఫ్రిదీ ఉన్నారు.

ఇంతవరకు T20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్ ఒక్కసారి కూడా టీమిండియాను ఓడించలేకపోయింది. ఇప్పటివరకు టీ20 ప్రపంచకప్‌లలో భారత్, పాకిస్థాన్ జట్లు ఐదుసార్లు తలపడగా.. ఈ ఐదు సార్లు కూడా భారతే గెలిచింది. ఈ నేపథ్యంలోనే పాకిస్థాన్ కెప్టెన్‌ బాబర్‌ అజమ్‌ ఈసారి కచ్చితంగా టీమిండియాపై విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశాడు.

ఇది కూడా చదవండి: Education: TS ఎంసెట్ తుది విడత కౌన్సెలింగ్‌.. షెడ్యూల్ విడుదల

Advertisement

తాజా వార్తలు

Advertisement