Thursday, May 9, 2024

టీ కాంగ్రెస్ కు హైకోర్టులో ఊర‌ట

వార్ రూమ్ ఘటనలో తెలంగాణ హైకోర్టులో తెలంగాణ కాంగ్రెస్ కు ఊరట లభించింది. పోలీసుల విచారణపై న్యాయస్థానం స్టే విధించింది. అదేవిధంగా 41 సీఆర్పీసీ నోటీసులపై కూడా స్టే ఇచ్చింది. ఇషాన్, శశాంక్, ప్రతాప్ లకు పోలీసులు నోటీసులు ఇవ్వగా.. ఆ నోటీసులను కొట్టివేయాలని కాంగ్రెస్ నేతలు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో కేసు విచారణతో పాటు నోటీసులపై ధర్మాసనం స్టే ఇచ్చింది. అనంతరం తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement