Saturday, May 4, 2024

Breaking: టీచర్ల ఆస్తి ప్రకటన ఉత్తర్వులు నిలిపివేత.. సస్పెండ్​ చేస్తూ ఆదేశాలిచ్చిన తెలంగాణ ప్రభుత్వం

విద్యాశాఖ ఉద్యోగుల వార్షిక ఆస్తి ప్రకటన చేయాలని విద్యాశాఖ సంచాలకులు జారీ చేసిన ఆదేశాలను ప్రభుత్వం సస్పెండ్‌ చేసింది. ఆదేశాలను తక్షణమే నిలిపివేస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. నిలిపివేత ఉత్తర్వులను వెంటనే జారీ చేయాలని విద్యాశాఖ కార్యదర్శిని మంత్రి ఆదేశించారు.

ఇంతకు ముందు తెలంగాణలో పనిచేస్తున్న ప్రభుత్వ ఉపాధ్యాయులు కూడా ప్రతి సంవత్సరం ఆస్తి వివరాలు సమర్పించాల్సిందేనని తెలంగాణ విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. ఇందుకు సంబంధించి మార్గదర్శకాల్ని విడుదల చేసింది. కొందరు ఉపాధ్యాయులు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడంతోపాటు, ఇతర మార్గాల్లో ఆదాయం పొందుతున్నారనే ఆరోపణల నేపథ్యంలో ఆదేశాలు ఇచ్చింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement