Thursday, April 25, 2024

2022 ఆర్చరీ ప్రపంచ కప్‌లో వర్మ- సురేఖ జోడికి గోల్డ్‌ మెడల్‌

ఆర్చరీ వరల్డ్‌ కప్‌ స్టేజీ-3 టోర్నీ కాంపౌండ్‌ మిక్స్‌డ్‌ టీం విభాగంలో అభిషేక్‌ వర్మ- జ్యోతి సురేఖ జోడీ గోల్డ్‌ మెడల్‌ సాధించింది. శనివారంనాడిక్కడ పారిస్‌లో ఐదో సీడ్‌ ఫ్రాన్స్‌ జోడి సోఫీ డోడెమంట్‌, జియాన్‌ ఫిలిప్పే బౌల్చ్‌తో జరిగిన ఫైనల్‌ మ్యాచ్‌లో 152-149 తేడాతో వర్మ- సురేఖ జోడీ ఓడించింది. దీంతో మిక్సిడ్‌ టీం టైటిల్‌తోపాటు గోల్డ్‌ మెడల్‌ను చేజిక్కించుకుంది. అభిషేక్‌ వర్మకు ఇది మూడో గోల్డ్‌ మెడల్‌.

టర్నీ, సౌత్‌కొరియాల్లో జరిగిన ఆర్చరీ వరల్డ్‌ కప్‌ టోర్నీలో మెన్స్‌ కాంపౌండ్‌ టీమ్‌ విభాగంలో అభిషేక్‌ వర్మ గోల్డ్‌ మెడల్స్‌ సాధించిన విషయం తెలిసిందే. 32ఏళ్ల అర్జున అవార్డీ గ్రహీత గ్వాంగ్జులోని మిక్స్‌డ్‌ టీం విభాగంలో అవ్‌నీత్‌ కౌర్‌తో కలిసి జ్యోతి సురేఖ రజత పతకం చేజిక్కించుకుంది. సెమీస్‌లో ఈస్టోనియా జోడీని వర్మ- సురేఖ జంట ఓడించిన విషయం తెలిసిందే.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement