Monday, April 29, 2024

సురేష్ ప్రొడ‌క్ష‌న్ హెచ్చ‌రిక – ఎందుకో తెలుసా

మానాడు సినిమా రీమేక్ హ‌క్కులు త‌మ ద‌గ్గ‌ర ఉన్నాయ‌ని, క‌థ‌లో ఏ భాగ‌మైనా కాపీ చేస్తే లీగ‌ల్ యాక్ష‌న్ తీసుకుంటామ‌ని హెచ్చ‌రించింది సురేష్ ప్రొడ‌క్ష‌న్ సంస్థ‌. హీరో శింబు న‌టించిన మానాడు చిత్రం థియేట‌ర్ లో రిలీజ్ అయింది. ఈ చిత్రం హిట్ టాక్ ని తెచ్చుకుంది. ఈ చిత్రాన్ని వెంక‌ట్ ప్ర‌భు తెర‌కెక్కించాడు. ఈ మూవీలో ద‌ర్శ‌కుడు ఎస్ జె సూర్య విల‌న్ గా న‌టించాడు. హీరోయిన్ గా క‌ళ్యాణి ప్రియ‌ద‌ర్శి న‌టించింది. పొలిటికల్ సైన్స్ ఫిక్షన్ డ్రామా గా తెరకెక్కిన ఈ చిత్రాన్ని తెలుగులో ది లూప్ పేరుతో విడుదల చేద్దామనుకున్నారు కానీ కుదరలేదు. అయితే తెలుగు వెర్షన్ ని డిసెంబర్ 24 న సోనీ లివ్ లో ఈ సినిమా స్ట్రీమింగ్ చేసారు.

అయితే ఈ సినిమా నిమిత్తం నేడు సురేష్ ప్రొడక్షన్ వారు పేపర్లో ప్రకటన ఇచ్చారు. సినిమా రీమేక్ హక్కులు తమ దగ్గర ఉన్నాయని.. కథలో ఏ భాగమైనా కాపీ చేస్తే లీగల్ యాక్షన్ తీసుకుంటామని హెచ్చరిస్తోంది. ‘మానాడు’ సినిమాను కాపీ కొట్టి తెలుగులో ఓ సినిమా రూపొందిస్తున్నారని విషయం సురేష్ ప్రొడక్షన్స్ వరకు వెళ్లింది. అందుకే ‘మానాడు’ రీమేక్ రైట్స్ గురించి లీగల్ నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇక మరో ప్రక్క ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్నారని.. దానికి సంబంధించిన హక్కులు గీతాఆర్ట్స్ చేతిలో ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. ఇందులో అల్లు శిరీష్ హీరోగా నటించే ఛాన్స్ ఉందన్నారు. అయితే నిజానికి ఈ సినిమా రీమేక్ రైట్స్ సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ దక్కించుకుందని తెలుస్తోంది. త్వరలోనే ఈ సినిమాను సురేష్ ప్రొడక్షన్ తెలుగులో రీమేక్ చేయబోతుంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement