Monday, April 29, 2024

Breaking: మహారాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు

మహారాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. మూడు రోజుల్లో అన్ని పక్షాలు వివరణ ఇవ్వాలని ఆదేశించింది. సుప్రీంకోర్టులో రెబల్స్ పిటిషన్ పై విచారణ వాయిదా వేసింది. మహారాష్ట్ర ప్రభుత్వంతో పాటు డిప్యూటీ స్పీకర్, అసెంబ్లీ సెక్రటరీకి కూడా సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఐదు రోజుల్లోగా కౌంటర్ అఫిడవిట్లు దాఖలు చేయాలని తెలిపింది. ఆ తర్వాత మూడు రోజుల్లోగా రిజాయిండర్ దాఖలు చేయాలని తెలిపింది. అనంతరం జులై 11వతేదీకి సుప్రీంకోర్టు తదుపరి విచారణను వాయిదా వేసింది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement