Thursday, May 2, 2024

హౌరా బ్రిడ్జి వ‌ద్ద – ‘ఆర్ ఆర్ ఆర్’ టీం

నిన్న పంజాబ్ లో ప‌ర్య‌టించారు యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్, ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి. కాగా నేడు ప‌శ్చిమ బెంగాల్ లో ఆర్ ఆర్ ఆర్ సినిమా ప్ర‌చార కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు. వారు ముగ్గురూ హౌరా బ్రిడ్జి వ‌ద్ద దిగిన ఫొటోల‌ను ఆర్ఆర్ఆర్ సినిమా యూనిట్ త‌మ అధికారిక ట్విట్ట‌ర్ ఖాతాలో పోస్ట్ చేసింది. ఆ ప్రాంతంలో వారు ముగ్గురూ స్థానిక మీడియాతోనూ మాట్లాడారు. మ‌రో మూడు రోజుల్లో ప్ర‌పంచ వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు రానున్న విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో దేశ వ్యాప్తంగా ప్ర‌చార కార్య‌క్ర‌మాల్లో రాజ‌మౌళి, తార‌క్, చెర్రీ బిజీగా ఉంటున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement