Thursday, May 2, 2024

Breaking: విజ‌యం వైపు దూసుకొస్తున్న స‌న్‌రైజ‌ర్స్‌.. 15వ ఓవ‌ర్‌లో 115/1

టాటా ఐపీఎల్​ 2022లో భాంగా ఇవ్వాల ముంబైలోని డీవై పాటిల్​ స్టేడియంలో సన్​రైజర్స్​ హైదరాబాద్​, గుజరాత్​ టైటాన్స్​ మధ్య మ్యాచ్​ జరుగుతోంది. అయితే బలమైన బ్యాటింగ్ లైనప్ ఉన్న గుజరాత్ టైటన్స్‌ను సన్‌రైజర్స్ బౌలర్లు అద్భుతంగా కట్టడి చేశారు. అయితే సన్‌రైజర్స్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో భారీ షాట్లు ఆడటానికి బ్యాట్స్‌మ‌న్ ఇబ్బంది ప‌డ్డారు. అయినా ఏడు వికెట్ల న‌ష్టానికి నిర్ణీత ఓవ‌ర్ల‌లో 167 ప‌రుగులతో గౌర‌వ‌ప్ర‌దమైన స్కోరు చేశారు. 168 ప‌రుగుల టార్గెట్‌తో బ‌రిలోకి దిగిన స‌న్‌రైజ‌ర్స్ కూడా మంచి ఓపెనింగ్స్‌నే కొన‌సాగించారు. 8.5ఓవ‌ర్ల‌లో 64 ప‌రుగుల వ‌ద్ద బ్యాట్స్‌మ‌న్ అభిషేక్ శ‌ర్మ వికెట్ పోగొట్టుకున్నాడు.

కాగా, 15వ ఓవ‌ర్ ముగిసే స‌రికి స‌న్‌రైజ‌ర్స్ జ‌ట్టు 115/1 గా స్కోరు న‌మోదు చేసింది. ఇంకా ఆరు ఓవ‌ర్లు మిగిలి ఉండ‌గా, 47 పరుగులు చేయాల్సి ఉంది. అభిషేక్ శ‌ర్మ (42) ప‌రుగుల‌కు అవుట్ కాగా, కెప్టెన్‌ కేన్ విలియ‌మ్స్ 46, రాహుల్ త్రిపాఠి (17) ర‌న్స్ చేసి రిటైర్డ్ హ‌ర్ట్‌గా పెవిలియ‌న్ చేరాడు. నికోల‌స్ పూర‌న్ 8 ర‌న్స్‌తో బ్యాటింగ్ చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement