Tuesday, April 30, 2024

Kerala | 21న 5 గంటల పాటు విమానాల రాకపోకలకు బ్రేక్

కేరళ రాష్ట్రంలోని తిరువనంతపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో ఏప్రిల్ 21 ఆదివారం రోజున సా.4 గంటల నుండి రాత్రి 9 వరకు విమానాల రాకపోకలపై నిషేధం విధించింది. ఈ విషయాన్ని తిరువనంతపురం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్ (TIAL) వెల్లడించింది. పద్మనాభస్వామి ఆలయం నుంచి బయలుదేరే పెంకుని ఆరట్టు ఊరేగింపు తిరువనంతపురం ఎయిర్‌పోర్ట్ గుండా వెళుతుందని, ఈ సమయంలో ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు ఐదు గంటల పాటు విమాన సర్వీసును నిలిపివేయాలని నిర్ణయించినట్లు TIAL వెల్లడించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement