Monday, May 6, 2024

ఢిల్లీలో ఆసక్తికర పరిణామం.. సీఎం కేసీఆర్ ను కలిసిన బీజేపీ ఎంపీ

ఢిల్లీలో కీలక రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీకి వెళ్లారు. ఈక్రమంలోనే పలువురు జాతీయ నాయకులు సీఎం కేసీఆర్ ను కలువనున్నట్లు తెలుస్తోంది. థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు లో భాగంగా దేశరాజధాని ఢిల్లీకి వెళ్లిన తెలంగాణ కేసీఆర్.. ఎన్డీయేతరు నాయకులను వరసగా కలుస్తున్నారు. ఈ క్రమంలో కీలక రాజకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. బిజెపి రాజ్య సభ సభ్యుడు, సీనియర్ రాజకీయ వేత్త, సుబ్రమణియన్ స్వామి గురువారం ఢిల్లీలో  ముఖ్యమంత్రి కె.చంద్ర శేఖర్ రావుతో భేటీ అయ్యారు. బీజేపీకి వ్యతిరేకంగా ప్రతిపక్ష పార్టీల నాయకులను సీఎం కేసీఆర్ కలుస్తున్న వేళ.. బీజేపీకి చెందిన ఎంపీ కేసీఆర్ తో ప్రత్యేకంగా భేటీక కావడం ఆసక్తిరేపుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement