Saturday, May 4, 2024

మోహన్ బాబుకు షాక్.. విద్యానికేతన్ విద్యాసంస్థల విద్యార్థలు ఆందోళన!

ఏపీలో కరోనా మహమ్మారి విలయం కారణంగా రాష్ట్రంలోని విద్యాసంస్థలను ఇప్పటికే మూసివేశారు. అయితే, తిరుపతి సమపంలోని సినీ నటుడు మోహన్ బాబుకు చెందిన శ్రీ విద్యానికేతన్ విద్యాసంస్థలు మాత్రం పనిచేస్తున్నాయని అక్కడి విద్యార్థులు ఆరోపిస్తున్నారు. విద్యార్థులు కరోనా భయంతో కళాశాలలకు సెలవు ప్రకటించాలని కోరుతున్నారు. ఇప్పటికే కరోనాతో ఓ విద్యార్థి చనిపోయాడని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కరోనా తీవ్ర రూపం దాల్చడంతో మూసి వేయాలని కోరుతూ విద్యార్థులు నినాదాలు చేస్తున్నారు. అయితే తాము చేస్తున్న ఆందోళనలను యాజమాన్యం పట్టించుకోవడం లేదని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే 150 మంది విద్యార్థులకు వైరస్ సోకిందని, కరోనాతో ఓ ఉపాధ్యాయుడు కూడా మృతి చెందాడని విద్యార్థులు అంటున్నారు.

మరోవైపు విద్యార్థుల ఆందోళనకు సంబంధించిన సమాచారం తెలుసుకున్న విద్యాసంస్థల అధినేత మోహన్ బాబు మాత్రం ఈ విషయంలో రేపటిలోగా నిర్ణయం తీసుకుంటామని చెబుతున్నట్లు సమాచారం. విద్యార్థులు ఆందోళనను విరమించాలని కోరారు.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement