Friday, April 26, 2024

పేదింటి ఆడబిడ్డలకు వరం కల్యాణ లక్ష్మి .. ప్రభుత్వ విప్ బాల్క సుమన్

పెద్దపల్లి – పేద ఇంటి ఆడబిడ్డ ల పాలిట కల్యాణ లక్ష్మి పథకం వరంలా మారిందని రాష్ట్ర ప్రభుత్వ విప్, చెన్నూరు శాసనసభ్యులు బాల్క సుమన్ పేర్కొన్నారు. మంగళవారం మంచిర్యాల జిల్లా మందమర్రి మున్సిపాలిటీ పరిధిలోని 72 మంది లబ్ధిదారులకు 71,83,352 రూపాయల కళ్యాణ లక్ష్మి చెక్కులను అందజేశారు. అనంతరం మాట్లాడుతూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతి నిరుపేద కుటుంబంలో ఆడపిల్ల వివాహాల కోసం కళ్యాణ లక్ష్మీ ద్వారా అందిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి పార్లమెంటు సభ్యులు బోర్లకుంట వెంకటేష్ నేత తో పాటు ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement