Friday, April 26, 2024

న‌ష్టాల‌తో ముగిసిన‌.. స్టాక్ మార్కెట్లు

నేటి స్టాక్ మార్కెట్లు న‌ష్టాల‌తో ముగిశాయి. వారాంతపు డెరివేటివ్స్ ఎక్స్ పైరీ మార్కెట్లపై ప్రభావం చూపింది. దీనికి తోడు చివర్లో అమ్మకాలు వెల్లువెత్తడంతో మార్కెట్లు భారీగా నష్టపోయాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 230 పాయింట్లు కోల్పోయి 61,750కి పడిపోయింది. నిఫ్టీ 65 పాయింట్లు నష్టపోయి 18,343 వద్ద స్థిరపడింది. ఎల్ అండ్ టీ (1.25%), ఐసీఐసీఐ బ్యాంక్ (0.63%), భారతి ఎయిర్ టెల్ (0.59%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (0.55%), యాక్సిస్ బ్యాంక్ (0.39%) బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్ గా నిలిచాయి. టైటాన్ (-2.21%), మహీంద్రా అండ్ మహీంద్రా (-2.16%), మారుతి (-1.63%), హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ (-1.39%), డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ (-1.31%) టాప్ లూజర్స్ గా మిగిలాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement