Tuesday, May 7, 2024

భారీ లాభాల‌తో ముగిసిన స్టాక్ మార్కెట్లు

నేటి స్టాక్ మార్కెట్లు భారీ లాభాల‌తో ముగిశాయి. అంతర్జాతీయంగా నెలకొన్న సానుకూల పరిణామాలు మన మార్కెట్లపై ప్రభావం చూపించాయి. ఈ నేపథ్యంలో, ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 740 పాయింట్లు పెరిగి 58,683కి చేరుకుంది. నిఫ్టీ 173 పాయింట్లు లాభపడి 17,498కి ఎగబాకింది. బజాజ్ ఫిన్ సర్వ్ (3.82%), బజాజ్ ఫైనాన్స్ (3.09%), మహీంద్రా అండ్ మహీంద్రా (2.81%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (2.60%), నెస్లే ఇండియా (2.20%) బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్ గా నిలిచాయి. ఐటీసీ (-2.16%), టాటా స్టీల్ (-1.98%), టెక్ మహీంద్రా (-1.69%), భారతి ఎయిర్ టెల్ (-0.68%), టైటాన్ (-0.60%) టాప్ లూజర్స్ గా మిగిలాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement