Sunday, May 5, 2024

లాభాల బాట‌లో స్టాక్ మార్కెట్స్ ..

ఈ వారాన్ని లాభాల‌తో ప్రారంభించాయి దేశీయ స్టాక్ మార్కెట్స్ .. ప్రారంభంలో న‌ష్టాల్లోకి వెళ్ళిన మార్కెట్లు అనంత‌రం లాభాల బాట ప‌ట్టాయి.. కాగా ట్రెండింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 153 పాయింట్లు లాభపడి 57,260కి చేరుకుంది. నిఫ్టీ 27 పాయింట్లు పెరిగి 17,053 వద్ద స్థిరపడింది. కొటక్ మహీంద్రా బ్యాంక్ (2.40%), హెచ్సీఎల్ టెక్నాలజీస్ (2.25%), టీసీఎస్ (1.61%), టైటాన్ కంపెనీ (1.42%), బజాజ్ ఫైనాన్స్ (1.41%), టాప్ గెయిన‌ర్స్ గా నిలిచాయి. సన్ ఫార్మా (-2.01%), ఎన్టీపీసీ (-1.67%), యాక్సిస్ బ్యాంక్ (-1.65%), నెస్లే ఇండియా (-1.35%), బజాజ్ ఆటో (-1.32%) టాప్ లూజ‌ర్స్ గా నిలిచాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement