Friday, April 26, 2024

స్పా సెంటర్‌ యువతులపై పోలీసుల అత్యాచారం..

అదో స్పా సెంట‌ర్‌.. అంద‌మైన యువ‌తులు ఉన్నార‌క్క‌డ‌.. అయితే వారి క‌న్ను ఆ యువ‌తుల‌పై ప‌డింది. ఎట్ల‌యినా స‌రే వారిని అనుభ‌వించాల‌నుకున్నారు. ఇంకేముందు వారి ఆలోచ‌న‌కు ప‌నిచెప్పారు. ఆఖ‌రికి అడ్డంగా దొరికిపోయారు. ఈ ఘ‌ట‌న హ‌ర్యానాలో జ‌రిగింది.. ఓ వెబ్‌సైట్ క‌థ‌నం ప్ర‌కారం.. స్పా సెంటర్‌ లోని ఇద్దరు మహిళా ఉద్యోగులపై అత్యాచారం చేసిన ఆరోపణలపై ఓ పోలీస్ హెడ్ కానిస్టేబుల్‌ తో సహా ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. హర్యానాలోని రేవారీ జిల్లాలో ఈ ఘటన జరిగింది.

హర్యానాలోని రేవారీ జిల్లా రేవారి మోడల్ టౌన్ పోలీస్ స్టేషన్‌ లో హెడ్ కానిస్టేబుల్ అనిల్, హోంగార్డు జితేంద్ర పని చేస్తున్నారు. ఓ రోజు అనిల్‌, జితేంద్ర, అతని ఫ్రెండ్ ధర్మేంద్ర లోక‌ల్‌గా ఉన్న‌ ఓ స్పా మసాజ్‌ సెంటర్‌ పై దాడి చేశారు. అక్కడ పనిచేస్తున్న ఇద్దరు యువతులను బలవ‍ంతంగా లాక్కొచ్చి వారి వాహనంలో ఎక్కించారు. ఆ త‌ర్వాత వారిని మరో కారులోకి చేంజ్ చేసి ఒక హోటల్‌ కు తీసుకెళ్లారు. అక్కడ ముగ్గురు కలిసి ఆ యువతులపై సామూహిక ఆ ప‌నికి పాల్పడ్డారు. ఈ విషయం ఎవరికైనా చెబితే అక్రమ కేసులు పెట్టి బొక్క‌లో తోస్తామ‌ని హెచ్చరించారు. భ‌య‌ప‌డ్డ ఆ యువతులు ఈ విషయాన్ని స్పా సెంటర్‌ యజమానికి చెప్పారు.

ఈ క్రమంలో స్పాసెంటర్‌ నిర్వాహకులు పోలీసులకు కంప్లెయింట్‌ చేశారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసు అధికారులు ఆ ముగ్గురిని అరెస్ట్‌ చేశారు. హెడ్ కానిస్టేబుల్‌ అనిల్‌ ను సస్పెండ్ చేశారు. హోంగార్డు జితేంద్రపై శాఖాపరమైన చర్యలకు సిఫార్సు చేసినట్లు డీఎస్పీ మహ్మద్ జమాల్ తెలిపారు. నిందితులు ఫుల్ గా తాగి ఉన్నార‌ని, వారిని కోర్టులో హాజరు పరిచి జ్యుడీషియల్ కస్టడీకి తరలించినట్లు చెప్పారు. బాధిత యువతులు పశ్చిమబెంగాల్ కు చెందిన వారిగా గుర్తించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ఆంధ్రప్రభ న్యూస్ కోసంఫేస్‌బుక్‌,  ట్విట్టర్పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement