Thursday, May 9, 2024

మూడో రోజు న‌ష్టాల‌తో ముగిసిన స్టాక్ మార్కెట్లు

వ‌రుస‌గా మూడో రోజు న‌ష్టాల‌తో ముగిశాయి స్టాక్ మార్కెట్లు. కాగా నేటి ఉదయం లాభాల‌తోనే ప్రారంభమైన మార్కెట్లు కాసేపటికే నష్టాల్లోకి జారుకున్నాయి. ఐటీ స్టాకులు భారీ నష్టాలను నమోదు చేశాయి. అమ్మకాల ఒత్తిడి మార్కెట్లపై తీవ్ర ప్రభావాన్ని చూపింది. దీంతో ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 303 పాయింట్లు నష్టపోయి 53,749కి పడిపోయింది. నిఫ్టీ 99 పాయింట్లు కోల్పోయి 16,025కి దిగజారింది. ఎన్టీపీసీ (3.84%), కోటక్ బ్యాంక్ (1.42%), భారతి ఎయిర్ టెల్ (1.41%), హెచ్డీఎఫ్సీ (1.35%), నెస్లే ఇండియా (1.02%) బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్ గా నిలిచాయి. ఏసియన్ పెయింట్స్ (-8.04%), టీసీఎస్ (-3.69%), టెక్ మహీంద్రా (-3.53%), విప్రో (-3.30%), ఎల్ అండ్ టీ (-3.09%) టాప్ లూజర్స్ గా మిగిలాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement